టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ సిద్దిపేటలో జరిగింది. ఈ సభ్యత్య నమోదులో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో జరిగిన 48 గంటల రైల్ రోకో దేశంలో ఎక్కడ జరగలేదని… తెలంగాణ ఉద్యమంలో మూడు రోజులు మెదక్ జైలులో ఉన్నామని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. జాతీయ పార్టీల్లో పనిచేసే నాయకులు ఢిల్లీలో గులాంగిరి చేస్తారని..కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్చీల కోసం రైతు యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ది రైతు యాత్ర కాదు..మొసలి కన్నీరు అని… కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు బంధు,ఉచిత కరెంట్, రైతు భీమా ఇస్తున్నారా చెప్పాలని ప్రశ్నించారు మంత్రి హరీష్రావు. రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే తిన్నది అరగక చేసుకున్నారని అన్నది కాంగ్రెసోళ్ల కాదా… ఎరువుల కోసం వస్తే రైతులపై లాఠీచార్జి చేసింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. రైతుల కోసం టిఆర్ఎస్ చేస్తున్న పథకాల గురించి సోనియా గాంధీకి చెప్పాలని.. అప్పుడైనా కాంగ్రెస్ బాగుపడుతుందని సూచించారు.
previous post
next post
నన్ను బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి: పవన్