గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నా ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఒక్కసారిగా తుపాకుల మోటామోగింది. గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. జిల్లాలోని కాగజ్నగర్ మండలంలోని కదంబా అటవీ ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమైనట్టు
తెలుస్తోంది.
భారీ వర్షం కురుస్తుండడంతో మృతదేహాల గుర్తింపు కష్టంగా మారింది. అయితే, చనిపోయిన వారిలో మరొకరు వర్గీస్ ఉన్నట్టు సమాచారం. ఆయన ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా దళ కమాండర్ గా నియమితులయ్యారు. చత్తీస్గఢ్కు చెందిన వర్గీస్పై రూ.5 లక్షల రూపాయల రివార్డు ఉంది.ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు కూడా మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఎన్కౌంటర్ లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్టు సమాచారం. రెండున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ స్థలం నుంచి ఏకే 47ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ విషయం తెలిసిన వెంటనే కుమురంభీం జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ, ఏఎస్పీ సుధీంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
జగన్ పేరు జాతీయస్థాయిలో వినిపిస్తోంది: మంత్రి కన్నబాబు