బిగ్ బాస్ తెలుగు సీజన్ -3 ప్రారంభం కాకముందే వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ బిగ్ బాస్ పై యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచనల కామెంట్స్ చేశారు. “బిగ్బాస్-3” ఈ నెల 21 న ప్రారంభం కానుంది. అయితే గత సెషన్స్కు భిన్నంగా బిగ్బాస్ 3 పలు వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ షోపై బంజారా హిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తాలు బిగ్బాస్ షోపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే నిర్వాహకులు బిగ్బాస్పై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హై కోర్టు నిర్వాహకులపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులు, పిటిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు నిర్వాహకులను అరెస్ట్ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఈ నెల 24న తదుపరి విచారణ జరగనుంది.
previous post
టాలీవుడ్ లో డ్రగ్… మాధవీలత వ్యాఖ్యలపై ఎక్సైజ్ పోలీసుల రియాక్షన్