హైదరాబాద్ కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ఎస్బీఐలో అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమట్టామయ్యారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఏసీలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బందికి కానీ, కస్టమర్లకు కానీ ఎవరికి ఎటువంటి హాని జరగలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంపై నష్టం అంచనా వేయటానికి ప్రత్యేక బృందం వస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు.