మాచో హీరో గోపిచంద్ అక్టోబర్ 5న “చాణక్య” అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు. ఈ చిత్రంలో బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. మరోవైపు గోపిచంద్ 28వ ప్రాజెక్ట్కి సంబంధించి కొద్ది రోజుల క్రితం అఫీషియల్ ప్రకటన వచ్చింది. సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ 28వ ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా, ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంపిక చేశారు. అతి త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. సంపత్ నంది, గోపి చంద్ కాంబినేషన్లో గౌతమ్ నందా అనే చిత్రం తెరకెక్కగా, ఈ చిత్రం 2017లో విడుదలై మిక్స్డ్ టాక్ పొందింది. తమన్నా, సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్ అనే చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. తమన్నా నటించిన “సైరా” చిత్రంతో పాటు బాలీవుడ్ క్వీన్ రీమేక్ చిత్రం “దటీజ్ మహాలక్ష్మీ” చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. పెట్రోమ్యాక్స్, యాక్షన్, బోలె చుడియాన్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.
previous post
కేసీఆర్ ఫైర్ బ్రాండ్… సినిమా వాళ్ళు భయపడట్లేదు : మంచు విష్ణు