telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

కరోనా సోకిందన్న భయంతో… ఉరి వేసుకున్న ప్రభుత్వోద్యోగి

suicide

కరోనా వైరస్ వ్యాప్తి దేశ ప్రజలందరినీ ఆందోళనలో ముంచెత్తుతోంది. వారిలో కొందరు ఎలాగైనా ఈ ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమిస్తామన్న నమ్మకంతో స్వీయ జాగ్రత్తలు పాటిస్తుంటే మరికొందరు మాత్రం భయాందోళనతో తనువు చాలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సహారాన్‌పూర్‌లోని నాకూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. అతను కరోనావైరస్ వ్యాప్తితో చాలా భయపడుతున్నానంటూ సూసైడ్ నోట్‌లో రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని స్థానిక పోలీసు అధికారి, ధృవీకరించారు.

Related posts