telugu navyamedia
క్రైమ్ వార్తలు

పల్లంకొండ రాజుది ఆత్మహత్యేనా..?

హైదరాబాద్ న‌గ‌రంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన పులికొండ రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత‌ని చేతిపై మౌనిక అని ఉన్న పచ్చబొట్టు, ఇతర గుర్తుల ఆధారంగా మృతదేహం ఆయనదేనని పోలీసులు ధ్రువీకరించుకరించారు.

సైదాబాద్‌ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య ఘటనతో సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులోని అతని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. పోలీసులే కాల్చి చంపేశారని నిందితుడి త‌ల్లి ఆరోపిస్తున్నారు. అడ్డగూడూరు నుంచి మమ్మల్ని శుక్రవారం తీసుకెళ్లారు. ఆరు రోజులు మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. రైల్వే స్టేషన్‌లో దొరికాడని ఆదివారమే అన్నారు.

sensational facts reveals by eyewitness of pallakonda raju suicide at station ghanpur railway track in front of konark express | Saidabad Raju Suicide: మానవ మృగం ఎలా చనిపోయిందంటే..?? ప్రత్యక్ష సాక్షి వివరణ ...

పోలీసులే తన కొడుకుని ఉరికించి ఉరికించి చంపేశారని ఆరోపించింది. రాజును ఎన్‌కౌంటర్ చేయాలని, పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాం. ఆరోజు హడావుడిగా కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. రాత్రి పది గంటలకు మాకు ఉప్పల్‌లో వదిలేశారు. వాడిని అక్క‌డ‌ చంపేశారు. వాళ్ల మీదే నాకు అనుమానం ఉంది. నాకు కడుపుకోత మిగిల్చారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే మృతదేహాన్ని అప్పగించాలని రాజు తల్లి, భార్య కోరుతున్నారు. రాజు కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో ఈరోజు ఉదయం స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

Related posts