నేడు జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా ఫెరోజ్ షా కోట్లా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ఉమేశ్ యాదవ్ వేసిన 4వ ఓవర్ మూడో బంతికి పృథ్వీషా(18) పార్థీవ్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ధవన్, శ్రేయస్ అయ్యరులు కలిసి స్కోర్ పెంచేందుకు ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ధవన్ అర్థశతకాన్ని కూడా సాధించాడు. అయితే చాహల్ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి ధవన్(50) వాషింగ్టన్కు క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూం బాటపట్టాడు. నిర్ణిత ఓవర్లలో ఢిల్లీ 187/5 పరుగులు చేసింది. రాజస్థాన్ ఆట ఏ తీరుగా ఉండబోతుందో చూడాలి.