telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

షాకింగ్‌ : భారీగా పెరిగిపోయిన పసిడి ధరలు..

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటినా బంగారం ఇప్పుడు మొదటిసారి కిందకి దిగ్గి వచ్చింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 53,420 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 48,970 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 320 పెరిగి రూ.51,380 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 290 పెరిగి రూ.47, 100 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే రూ. 741 పెరగడంతో రూ.74, 100కి చేరుకుంది.

Related posts