ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ జీపుతో ఓ సబ్ ఇన్స్పెక్టర్ కూరగాయల మార్కెట్లో హల్చల్ చేసి భయాందోళనను సృష్టించాడు. ప్రయాగ్రాజ్ జిల్లా గూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఎస్ఐ సుమిత్ ఆనంద్వారంతపు సంతలో పోలీస్ జీపుతో కూరగాయల మార్కెట్లో విధ్వంసం సృష్టించాడు.
అమ్ముకునేందుకు పోసిన కూరగాయలను పోలీస్ జీపుతో అతివేగంగా వచ్చి వరుసగా తొక్కించాడు. వెహికల్ను రివర్స్ చేసి సైతం మిగతా కూరగాయల పైనుంచి పోనిచ్చాడు. మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలని, కూరగాయలు అమ్మొద్దన్న తన ఆదేశాలు పాటించని కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా సమాచారం.
జరిగిన ఘటనను వీడియోలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాగ్రాజ్ ఎస్ఎస్పీ సత్యార్థ్ అనిరుద్ పంకజ్ సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేసినట్టు మీడియా ద్వారా తెలిపారు. ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు.