telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పాకిస్థాన్‌ కు పాకిన కరోనా..తొలి మరణం నమోదు

karona

ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ మన పొరుగు దేశం పాకిస్థాన్‌ను కూడా వ్యాపించింది. పాక్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయాడని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. హఫీజాబాద్‌కు చెందిన అతను ఇటీవలే ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు.

కరోనా లక్షణాలు ఉండడంతో ఇరాన్–టాఫ్టాన్‌ సరిహద్దుల్లో అతడిని రెండు వారాల పాటు క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే, అతని ఆరోగ్యం క్షీణించడంతో లాహోర్‌‌లోని మయో ఆసుపత్రికి తరలించారు. వ్యాధి తీవ్రత పెరగడంతో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. పాకిస్థాన్‌లో ఇప్పటిదాకా 189 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డాన్‌ పత్రిక తెలిపింది.

Related posts