telugu navyamedia
రాజకీయ వార్తలు

సీఏఏ అంశంపై దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

congress MP Digvijay singh

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సీఏఏ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భోపాల్ లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు దిగ్విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరించే దుస్తులను బట్టి వారు ముస్లిమా, హిందువా అనే విషయం చెప్పగలనని ప్రధాని మోదీ అంటున్నారని, బీజేపీ నేత కైలాస్ విజయ వర్గీయ ప్రధానికంటే ఓ అడుగు ముందే ఉన్నారని వ్యాఖ్యానించారు.

పోహా వంటకం తినే విధానాన్ని బట్టి వారి పౌరసత్వం గురించి చెబుతానని కైలాస్ విజయ వర్గీయ అంటున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ ఇవాళ మన మధ్య ఉంటే సీఏఏకి వ్యతిరేకంగా తప్పకుండా ఉద్యమించే వారని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సపవరణ చట్టం వద్దంటూ షహీన్ బాగ్ లో నిరాహారదీక్షకు దిగేవారని పేర్కొన్నారు.

Related posts