అయోధ్య రామమందిర నిర్మాణానికి ఈరోజు భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ రామ మందిర భూమి పూజకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి యోగీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని తయారు చేసిన మందిర నిర్మాణ ప్రణాళికను తాము అమలు చేస్తామన్నారు. మోడీ మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ తమకు సహాయకారిగా ఉంటుందన్నారు. నేడు ఆయోధ్యలో భూమి పూజకు హాజరైనందుకు రాష్ర్ట, దేశ పౌరుల తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయోధ్యలో ఒక గొప్ప ఆలయం ఉంటుందని, ఇది ప్రపంచానికి శాంతిని పంచుతుందన్నారు.