telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు సాదర స్వాగతం ప‌లికిన సీఎం జగన్ దంపతుల

*ఏపీకి చేరుకున్న ద్రౌపది ముర్ము
*ముర్మును స‌న్మానించిన వైఎస్ జ‌గ‌న్‌
*మంగ‌ళ‌గిరిలో సీకే కన్వెన్షన్ సెంట‌ర్‌లో స‌మావేశం
*మంగళగిరి సీకే కన్వెన్షన్‌కు చేరుకున్న ముర్ము, సీఎం జగన్
*వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకన్న ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు సాదరస్వాగతం పలికారు.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ద్రౌపది ముర్ముకు ఆశిర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు. అలాగే సీఎం జగన్ కూడా జ్ఞాపిక అందజేసారు.

సీఎం వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సీఎం వైఎస్ జగన్‌తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు.


కాగా అంత‌కుముందు ఏపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, గోరంట్ల మాధవ్‌ స్వాగతం పలికారు.ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు ఘన స్వాగతం అందించారు.

 

Related posts