ఇటీవల “ప్రతిరోజూ పండగే” సినిమాతో భారీ విజయం అందుకున్నాడు మెగా హీరో సాయితేజ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సాయితేజ కు జోడిగా నభా నటేష్ నటిస్తోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. అయితే.. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కరోనా కారణంగా ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి. అయితే.. ఈ సినిమా రిలీజ్పై మెగాస్టార్ ట్వీట్ చేశాడు. లాక్డౌన్ తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.
previous post