ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ కుటుంబంలో విషాదం నెలకొంది. సీఎం భూపేష్ బాఘెల్ తల్లి బిందేశ్వరి బాఘెల్ (78)ఈ రోజు మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ రాయ్ పూర్ రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బిందేశ్వరి బాఘెల్ భౌతికకాయాన్ని బిలాయ్లోని బాఘెల్ నివాసానికి తరలించి..ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. ముక్తిథామ్లో రేపు బిందేశ్వరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బిందేశ్వరి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
previous post