తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లీ కొడుకు పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం పోతన కాలనీకి చెందిన కాదాసి ఎల్లయ్య బైక్పై తన స్వగ్రామం జనగామకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. అదే కాలనీకి చెందిన శ్రీనివాస్రెడ్డి సతీమణి అంజలి తన ఇద్దరు కొడుకులు నిఖిల్, శ్యాంలను తీసుకొని స్కూటిపై గోదావరిఖనికి వెళుతున్నది.
ఈ క్రమంలో కోల్ కారిడార్ రోడ్డు రెడ్డి కాలనీ వద్ద ఎల్లయ్య బైక్ అతి వేగంగా ఎదురుగా వస్తున్న స్కూటిని ఢీకొంది. దీంతో ఒక్కసారి రెండు బైక్లపై ఉన్న నలుగురు ఎగిరిపడ్డారు. ఎల్లయ్య(57), నిఖిల్ (12)కు తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందగా, అంజలి, శ్యామ్కు తీవ్రగాయాలు కావడంతో గోదావరిఖని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
టీఆరెస్ వచ్చే రెండేళ్లు కొనసాగడం కష్టమే : బండి