telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫ్లై ఓవర్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: కేటీఆర్‌

KTR TRS Telangana

ఫ్లై ఓవర్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని తెలంగాణ మంత్రి అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్, కామినేని దవాఖాన‌ ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. వీటిని గురువారం నాడు జాతికి అంకితం చేస్తామని కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతున్నది. ఒకవైపు కాళేశ్వరం జలాలను కొండ పోచమ్మసాగర్‌లోకి పంపింగ్‌ చేస్తూ రైతుల కోసం కష్టిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషిచేస్తోందని పేర్కొన్నారు.

Related posts