టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూచంద్రబాబు, పవన్ వి దిగజారుడు రాజకీయాలని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబుకు తొత్తుగా పవన్ వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు హయాంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఏపీలో వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, పవన్ లు .. ఆరునెలల్లో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను చెబితే కనుక తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు.