telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

క్లీన్ స్వీప్ సాధించిన.. భారత్.. మార్పులు కలిసొచ్చాయి..

india win in t20 series clean sweep

నేడు కివీస్ తో జరిగిన చివరి టీ 20లో 7పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20ఓవర్ల లో మూడు వికెట్ల నష్టానికి 163పరుగులు చేయగా లక్ష్య ఛేదన లో న్యూజిలాండ్ 9వికెట్లు కోల్పోయి 156పరుగులకు మాత్రమే పరిమితమై మరో ఓటమిని చవి చూసింది. 4ఓవర్ల లో కేవలం 12పరుగులు మాత్రమే ఇచ్చి 3వికెట్లు తీసిన టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా సిరీస్ ఆద్యాంతం అద్భుతంగా రాణించిన కీపర్ కమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

రాహుల్ మొత్తం 5మ్యాచ్ ల్లో కలిపి రెండు హాఫ్ సెంచరీలతో 224 పరుగులు చేసి సిరీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక 5మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో సొంత గడ్డపై భారత్ చేతిలో న్యూజిలాండ్ మొదటి సారి వైట్ వాష్ కు గురైంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 5వ తేదీన ప్రారంభం కానుంది.

Related posts