telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గుంటూరు జైలులో రైతులను పరామర్శించిన చంద్రబాబు

chandrababu

మీడియాపై దాడికి పాల్పడ్డారని ఆరుగురు రాజధాని రైతులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు గుంటూరు జైలుకి తరలించారు. జైలులో ఉన్న రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు పరామర్శించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ఆందోళనలు చేసే రైతులను దొంగలుగా చిత్రీకరించారు. రైతులను పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు.నేరానికి పాల్పడితే నోటీసులు ఇచ్చి వారి బంధువులకు చెప్పి పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్నారు.

రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, సీఎం జగన్ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. డీజీపీని నేరుగా అడుగుతున్నాను. నేను అన్ని పర్మిషన్లు తీసుకుని అమరావతికి వెళ్లాను నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పట్లో కొందరు అన్నారు… ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ఎన్నో కష్టాలు ఉన్న రైతులు నిరసన తెలుపుతుంటే వారిపై ఇటువంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు.

Related posts