telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

14 లక్షల రూపాయలను చెత్త కుప్పలో పారేసిన జంట… ఎందుకంటే ?

Hyderabad Police Seize Three Crores

బర్న్హమ్‌లో నివసిస్తున్న ఆ జంట.. చనిపోయిన తన బంధువు ఇంటిని శుభ్రం చేశారు. అనంతరం చెత్త, పనికిరాని వస్తువులను కారులో వేసుకుని డంపింగ్ యార్డులో పడేశారు. అక్కడ చెత్తను వేరు చేసే కార్మికులు సంచుల్లో ఉన్న 15 వేల పౌండ్లు (రూ.14 లక్షలు) చూసి షాకయ్యారు. ఆ నగదులో కనీసం ఒక నోటును కూడా వారు తీసుకోలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని రూ.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీసీటీవీ కెమేరాలను పరిశీలించారు. కారులో ఓ జంట అక్కడికి వచ్చి డబ్బుల సంచి పడేసి వెళ్లినట్లు తెలుసుకున్నారు. కారు నెంబరు ఆధారంగా ఆ జంట ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆ డబ్బుల సంచిని ఎందుకు డంపింగ్ యార్డులో పడేశారని పశ్నించారు. ఊహించని ఈ ట్విస్టుకు వారిద్దరూ ఆశ్చర్యపోయారు. అది తాము ఇంటిని శుభ్రం చేస్తుండగా వచ్చిన చెత్త అని, అందులో డబ్బులు ఉన్న సంగతి తమకు తెలియదని తెలిపారు. చనిపోయిన మహిళకు నగదును ఇంట్లో వస్తువుల మధ్య దాచుకునే అలవాటు ఉందని, బహుశా.. ఆ సొమ్మును వైర్లు, ఇతర వ్యర్థాల మధ్య పెట్టి ఉంటుందని తెలిపారు. దీంతో పోలీసులు ఆ సొమ్మును వారికి తిరిగి ఇచ్చేశారు. ఈ సందర్భంగా పోలీసులు డంపింగ్ యార్డులో సిబ్బందిని అభినందించారు. వారి నిజాయితీని మెచ్చుకుంటూ ఈ వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Related posts