కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఓ మీడియా చానెల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. నిన్న కేసీఆర్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రినని మర్చిపోయి నియంతలా వ్యవహరిస్తున్నఆయన పోకడలను కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకువెళ్తానని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
తమ ఎంపీలను విమర్శించే హక్కు కేసీఆర్కు లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎంగా కేసీఆర్ చేస్తున్న బెదిరింపులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని కేంద్ర చట్టంలో ఎక్కడ లేదని చెప్పారు. డెడ్లైన్ విధించడమంటే ఆర్టీసీ కార్మికులను బెదిరించడమేనన్నారు.