“అలా ఎలా” చిత్రంతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్. ఈ ముద్దుగుమ్మకు మొదటి చిత్రం కంటే ఆ తర్వాత చేసిన “కుమారి 21ఎఫ్” చిత్రంతో మంచి బ్రేక్ లభించింది. ఈ చిత్రంతో హెబ్బాకు వచ్చిన క్రేజ్ చూసి టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లడం ఖాయమనుకున్నారు అంతా. వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి. ఈడో రకం ఆడో రకం, ఏంజేల్ అనే పలు చిత్రాలలో నటించింది. ఏ చిత్రం కూడా తనకి మంచి విజయాన్ని అందించలేదు. ఈ క్రమంలో హెబ్బా బిగ్ బాస్ హౌజ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా… ఈ అమ్మడు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ డైరెక్షన్లో నటించింది. నటుడిగాను, యాడ్ ఫిలిం మేకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ని తన ఏజెన్సీలో రూపొందిస్తున్నాడు. ఈ యాడ్ కోసం హెబ్బా పటేల్పై కొన్ని సీన్స్ షూట్ చేశాడు. ఆమెతో సెల్ఫీ దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ “టైటిల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, నా బహుముఖ ప్రతిభ ఎప్పటికి ఒకేలా ఉంటుంది. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్ను డైరెక్ట్ చేస్తున్నాను” అని కౌశల్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ వాణిజ్య ప్రకటన ప్రసారం కానుంది. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్-2 విన్నర్ కౌశల్ దర్శకత్వంలో చేస్తుండడం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.
previous post
కమల్, రజనీ రాజకీయాలపై తమన్నా స్పందన