telugu navyamedia
సినిమా వార్తలు

వరద బాధితులకు 500 ఇళ్ళు కట్టిస్తున్న నటుడు

Nana-Patekar

లైంగిక ఆరోపణలతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న ప్ర‌ముఖ న‌టుడు నానా ప‌టేక‌ర్‌. ఆయనపై త‌నుశ్రీ ద‌త్తా లైంగిక ఆరోప‌ణ‌లు చేయ‌డం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. అయితే తాజాగా ఆయ‌న ఓ మంచి పని చేయడానికి ముందుకొచ్చి వార్త‌ల‌లోకి ఎక్కారు. కొల్హాపూర్‌లోని షిరోల్ ప‌రిస‌ర ప్రాంతాల‌లోని ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల వ‌ల‌న తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంద‌రైతే వ‌ర‌ద‌లలో త‌మ ఇళ్ళు కొట్టుకుపోవ‌డంతో నిరాశ్ర‌యుల‌య్యారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన నానా ప‌టేక‌ర్ వ‌ర‌ద బాధితుల‌కి 500 ఇళ్ళు క‌ట్టించేందుకు సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నేను షిరోల్‌కు వెళ్ళినప్పుడు అక్క‌డి పరిస్థితిని చూశాను. అందుకే మేము 500 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నాము. తక్లేవాడిలోని 3 వేల ఇళ్ల పరిస్థితిని సమీక్షించబోతున్నాం. ప్రభుత్వానికి కూడా దాని పరిమితులు ఉన్నాయి. అందువల్ల మనమందరం వరద ప్రభావిత పౌరులకు పునరావాసం కల్పించడానికి ప్రయత్నించాలి” అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Related posts