వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారంటూ మాజీ మంత్రి భూమా అఖిల కర్నూల్ జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. వైసీపీ నాయకులు ఫోర్జరీ చేసి టిడిపి అభ్యర్దులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నట్లు బెదిరిస్తున్నారని భూమా అఖిల ప్రియ సంచలన ఆరోపణలు చేసింది. టీడీపీ అభ్యర్దులు ఎక్కడా సంతకాలు చేయలేదని… దీనిపై స్పష్టత ఇవ్వాలని జేసిని కోరానని భూమా అఖిల పేర్కొంది. వైసీపీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు అక్రమ కేసులు బునాయిస్తే తాము కౌంటర్ కేసులు పెడతామని భూమా అఖిల హెచ్చరించింది. ఓట్లు వేయకపోతే పింఛన్లు, ఇళ్లు ఇచ్చేదిలేదని ఆళ్లగడ్డలో వైసీపీ నాయకులు నీచరాజకీయాలు చేస్తున్నారని భూమా అఖిల ఫైర్ అయింది. కాగా.. భూమా అఖిల ప్రియను బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలిగా పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బోయిన్పల్లి కిడ్నాప్ కేసు కోర్టు పరిధిలో ఉంది.
previous post
సుశాంత్ ను రియా వేధించింది… అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు