telugu navyamedia
Uncategorized

కేసీఆర్‌ కుటుంబంపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు…

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు…అమరుల త్యాగాలతో ఏర్పడ్డ కేసీఆర్ కుటుంబం…తెలంగాణలో చేరి దోచుకుంటుందని ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో మూర్ఖత్వపు, అవినీతి, రజాకార్ పాలన కొనసాగుతోందని…రాక్షస పాలన నుండి విముక్తి కోసం యువమోర్చా పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ తో పొత్తు ఉండదు… ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్‌ఎస్‌తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికలు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్ లు గుర్తుకు వస్తాయి, లేఖలు రాస్తారని చురకలు అంటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. కార్పోరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తుందని…ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందన్నారు. పైసలు వెదజల్లి టీఆర్‌ఎస్‌ గెలిచింది.. Trs ఎక్కడ విజయోత్సవాలు జరుపుకోలేదు… ఎలా గెలిచారో వారికి తెలుసు అని పేర్కొన్నారు. ఎందరో ప్రాణ త్యాగాల వల్ల ఈ రోజు బీజేపీ ఈ స్థాయికి వచ్చిందని…వారి లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని బండి సంజయ్‌ అన్నారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా కృషి చేయాలని.. గోల్కొండ కోట మీద కాషాయ జెండానే మనకు కనిపించాలని తెలిపారు. ప్రభుత్వాన్ని హెచ్చరించడానికే నాగార్జున సాగర్ లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కి సీటు ఇచ్చామని.. భయపడే కార్యకర్తలు బీజేపీకి అవసరం లేదన్నారు. పోలీసులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని..సంఘ విద్రోహ శక్తులకు ఈ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఫైర్‌ అయ్యారు. కోవిడ్ ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని… ప్రజల్ని కాపాడాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.

Related posts