telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నియంతృత్వ పాలన చేస్తున్న కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పారు

BJP Bandi sanjay

సీఎం కెసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. సన్నవడ్లు పండించాలని సీఎం కేసీఆర్ చెబితే రైతులు అనేక ఇబ్బందులు పడి వాటిని పండించారని పేర్కొన్నారు. వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునే దిక్కులేదని… రైతులను సన్నవడ్లు పండించాలన్న కేసీఆర్…తన ఫాంహౌజ్ లో మాత్రం దొడ్డురకం వడ్లు పండిస్తూ రాచరికంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. భూసార పరీక్షల కోసం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన రూ.125 కోట్లు ఎక్కడికిపోయాయో కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు బండి సంజయ్. ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించుకోవాలని భావించే దుబ్బాక ప్రజలు బీజేపీని ఆదరించారని తెలిపారు. నియంతృత్వ, నికృష్ట, నియంతృత్వ, కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పారని..ఇప్పటికైనా కేసీఆర్ చిత్తశుద్ధితో ప్రజాసమస్యలపై దృష్టి సారించాలన్నారు బండి సంజయ్. వచ్చే గ్రేటర్ ఎన్నకల్లోనూ బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఫలితమే గ్రేటర్ లో వస్తుందన్నారు. 

Related posts