హైదరాబాద్ నగరంలో ప్రేమజంటల పై దాడులు పెరిగిపోతున్నాయి. మొన్న ఎస్ ఆర్ నగర్ లో నడి రోడ్డుపై ప్రేమ జంటను వెంబడించి యువతి బందువులు కత్తులతో దాడి చేయడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మరువకముందే గత రాత్రి నగరంలోని నక్లెస్ రోడ్ లో విహారానికి వెళ్లిన ఓ ప్రేమజంటపై కొందరు యువకులు దాడి చేశారు.
ఈ ఘటన పై రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే తన ప్రియురాలితో కలిసి, ఓ యువకుడు నడుస్తూ వెళుతుండగా, కొందరు సామూహిక దాడికి దిగారు. యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ