ఏపీలో ఆలయాల పై జరుగుతున్న వరుస దాడుల పైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… పోలీసులు సున్నిత సమయంలో సంయమనంతో వ్యవహరించలేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. రామతీర్థం క్షేత్రంలో కోదండరామ స్వామి విగ్రహం తల నరికి వేస్తే భక్తుల మనోభావాలు ఎంతో తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘాతుక చర్యను నిరసించిన వారిపై ఆ క్షేత్రంలో పోలీసులు వ్యవహరించిన విధానం అప్రజాస్వామికంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకురాలు రెడ్డి పావని గారు సొమ్మసిల్లి పోయే విధంగా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఆ వ్యవస్థ ఎవరి కోసం పని చేస్తుందో అర్థం అవుతుంది. అధికార పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు తమ పార్టీ వాళ్ళతో జెండాలు పట్టుకుని మరీ కొండ ఎక్కుతుంటే పోలీసులు సహకరించారు అని పేర్కొన్నారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న వారి గొంతులు నొక్కడం, లాఠీలతో విరుచుకుపడటాన్ని ఖండిస్తున్నాం అన్నారు. ఆలయాలపై దాడులను అరికట్టడంలో పోలీసు వ్యవస్థ విఫలమైంది అని తెలిపారు. దురదృష్టకర ఘటనలను నిరసించే వారిని మాత్రం కట్టడి చేస్తుంది నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. దీనిని కాలరాయాలని, తద్వారా తప్పులను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేయవద్దని పోలీసులకు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
కోడెలపై ప్రభుత్వం ఒక్క కేసు కూడా పెట్టలేదు: ఉమ్మారెడ్డి