telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

జర్నలిస్టులను దూషిస్తూ దాడి.. ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ARREST crime

జర్నలిస్టులను దూషిస్తూ దాడికి పాల్పడ్డ ఆరుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. సబర్బన్‌ ఒశివారాలోని భగత్‌ సింగ్‌ నగర్‌ ఏరియాలో మంగళవారం 19 ఏళ్ల యువతి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందింది. ఆ తర్వాత కొందరు ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు ఆ యువతి తల్లితో మాట్లాడటానికి ఆమె ఇంటికి వెళ్లారు.

మీడియా ప్రతినిధులు యువతి తల్లితో మాట్లాడి తిరిగొస్తుండగా సుమారు 10-15 మంది వారిని దూషిస్తూ..దాడి చేశారు. జర్నలిస్టుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

Related posts