ఐఏఎస్ అధికారి ఎస్ఆర్కేఆర్ విజయకుమార్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ మంత్రులు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపె విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజధానిపై బీసీజీ నివేదికను మున్సిపల్శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయ్కుమార్ తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించారని అన్నారు. ఈ నివేదికపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికావని అన్నారు. విజయ్కుమార్పై అనుచిత వ్యాఖ్య చేయడం ద్వారా ఆయన కుల దురహంకారాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు.
అధికారిగా విజయ్కుమార్ బాధ్యతలు ఏంటో, ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసని మంత్రులు అన్నారు. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆయనపై వ్యాఖ్యలు చేశారని అన్నారు. అయినప్పటికీ ఏ వ్యవస్థలూ ఆయనను ఏమీ చేయలేవని, ఎందుకంటే ఆయన అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేస్తున్నాడని మంత్రులు దుయ్యబట్టారు.
ఎస్సీలను విడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు: జగన్