telugu navyamedia
క్రీడలు వార్తలు

ధావన్ పై గవాస్కర్ ప్రశంసలు…

టీమిండియా సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ఫామ్‌లోకి రావడం సంతోషకరమని క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో గబ్బర్ వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయన్నారు. రోహిత్‌ శర్మతో కలిసి ధావన్‌ విధ్వంసకరమైన భాగస్వామ్యాలు ఇచ్చాడు. జట్టుకు ఎన్నోసార్లు మేలు చేశాడు. ఇక ఈ తొలి వన్డేలో అతడు ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని సన్నీ ప్రశంసించారు. రోహిత్‌ ఎప్పటిలా బాగా ఆడలేకపోయాడు. అందుకే ధావన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నాడు. కొన్ని షాట్లు ఆడాక అతడిలో మంచి ఆత్మవిశ్వాసం కనిపించింది. ఆ తర్వాత తన సామర్థ్యం మేరకు షాట్లు ఆడాడు అని అన్నారు. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ధావన్‌ 98 పరుగులు చేసాడు. అద్భుతంగా ఆడిన ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Related posts