ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో భవార్త చెప్పింది. ఇప్పటికే రూ.10 వేల రైతు సాయం అందించాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు, మరో కానుకను ఇవ్వాలని నిర్ణయించారు. మార్చి 4లోపు నాలుగవ విడత, ఏప్రిల్ లో ఆఖరి ఇన్ స్టాల్ మెంట్ డబ్బులను రైతులకు అందించాలని అధికారులకు సూచించారు.
2014 ఎన్నికలకు ముందు రుణమాఫీ హామీ ఇచ్చిన చంద్రబాబు, ఐదు విడతల్లో రుణమాఫీని పూర్తి చేయాలని భావించారు. గడచిన మూడేళ్లలో మూడు విడతల చెల్లింపులు పూర్తయ్యాయి. మరో రెండు విడతలు చెల్లించాల్సివుండగా, ఆ నిధులను వెంటనే సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
దళితులను అణగతొక్కాలని ప్రభుత్వం కుట్ర: చినరాజప్ప