telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

YCP released MLA Candidates List

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం తొమ్మిది మంది పేర్లను ఇందులో ప్రకటించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శనివారం రాత్రి 9.15 నిమిషాలకు ఈ జాబితాను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది మంచి ముహూర్తమని స్వామి స్వరూపానందేంద్ర స్వామి చెప్పడంతో ఈ జాబితాను వెల్లడించినట్లు ఆయన తెలిపారు.

అభ్యర్థులు విజయం సాధించేందుకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, కోర్ కమిటీ అన్నిరకాల చర్చించి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలపై కసరత్తు చేసిందని తెలిపారు. తొలి జాబితాలో ప్రస్తుత ఎంపీలు అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఇద్దరు మహిళలకు టికెట్లు కేటాయించారు. తొలి జాబితాలో ఇద్దరు ఓసీలు, ఒక ఎస్టీ, ముగ్గురు బీసీ, ముగ్గురు ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు.

తొలి జాబితాలో ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు వీరే:
కడప– వైఎస్‌ అవినాష్‌రెడ్డి
అరకు– మాధవి గొట్టేటి(ఎస్టీ)
బాపట్ల – నందిగం సురేశ్‌ (ఎస్సీ)
అమలాపురం –చింతా అనూరాధ (ఎస్సీ)
అనంతపురం– తలారి రంగయ్య (బీసీ)
కర్నూలు – డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌(బీసీ)
రాజంపేట – పి.మిథున్‌రెడ్డి
చిత్తూరు – రెడ్డప్ప(ఎస్సీ)
హిందూపురం– గోరంట్ల మాధవ్‌(బీసీ)

Related posts