“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, దిల్రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఈయన మహేష్ సరిలేరు నీకెవ్వరు నుంచి బయటికి రావడంతో కొందరేమో అనిల్ రావిపూడి ఈ చిత్రం నుంచి జగపతిబాబును తీసేశారని అంటుంటే… మరికొందరు మాత్రం జగ్గూ భాయ్ బయటికి వచ్చేసాడంటున్నారు. మహేష్ బాబుతో ఈయనకు శ్రీమంతుడు, మహర్షి సినిమాల అనుబంధం ఉంది. ఇలాంటి తరుణంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దీనిపై వివరణ ఇచ్చారు. అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా స్పందిస్తూ. “సరిలేరు నీకెవ్వరు” సినిమాలోని పాత్రను జగపతిబాబుగారు చాలా ఇష్టపడ్డారు. ఈ ప్రాజెక్టులో భాగం కావాలని ఆయన భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. త్వరలోనే జగపతిబాబుగారితో పని చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు సర్” అంటూ అనిల్ ట్వీట్ చేశాడు. అలాగే జగపతిబాబు కూడా వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
next post
వీళ్లకు అసలు సిగ్గు, శరం లాంటివి ఏమైనా ఉన్నాయా?… కత్తి మహేష్ పై మాధవీలత ఫైర్