తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్షణ్, ఈనెల 6న అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని షా ప్రారంభిస్తారని తెలిపారు. కొత్తగా పార్టీలో చేరే నేతలను అమిత్ షా కు పరిచయం చేస్తామన్నారు.
పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని, చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నామని లక్ష్మణ్ అన్నారు. ఈసారి అదనంగా 40 శాతం సభ్యత్వాన్ని పెంచబోతున్నామని, 2024 తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రద్దుల ప్రభుత్వంలా వైసీపీ సర్కారు: చంద్రబాబు