telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఇంటర్‌ విద్యార్థులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు

KTR TRS Telangana

తెలంగాణలో ఈరోజు నుంచి జరగనున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఒత్తిడికి గురికావద్దని పరీక్షలో ఉత్తమ ప్రదర్శన చూపాల్సిందిగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదన్నారు.

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 4 లక్షల 80 వేల 516 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది. రాష్ర్టవ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Related posts