telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాపై పోరాటానికి బ్రహ్మానందం సాయం

brahmanandam with brahmmi is back movie

కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. కరోనాపై జరుగుతున్న ఈ పోరాటంలో తామూ భాగమవుతామని ముందుకొస్తున్నారు సినీ తారలు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తన విరాళాన్ని ప్రకటించారు. తాజాగా కమెడియన్ బ్రహ్మానందం తన వంతుగా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాల్లోని కార్మికులు ఉపాధి కోల్పోయారు. సినీ రంగం విషయానికొస్తే.. సినిమా షూటింగ్స్ అన్నీ రద్దు కావడంతో సినీ కార్మికులకు పని దొరకక అల్లాడి పోతున్నారు. సినీ కార్మికులు ఎదుర్కొంటున్న ఈ దుర్భర పరిస్థితి గమనించిన సినీ పెద్దలు.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ‘మనకోసం’ ఏర్పాటు చేశారు. ఈ సీసీసీ ద్వారా నిరుపేదలైన సినీ కార్మికులకు అండగా నిలుస్తామని, ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు చిరంజీవి. మెగాస్టార్ పిలుపు మేరకు ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున, లావణ్య త్రిపాఠి, బాలకృష్ణ లాంటి ఎందరో నటీనటులు సీసీసీకి తమ విరాళాలు ప్రకటించి ఉదారత చాటుకుంటున్నారు.

Related posts