అమెరికాలో ఇటీవల తుపాకీ కాల్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. విచక్షణ రహితంగా దుండగులు చేసే కాల్పులలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెపుతూనే ఉంది తప్ప, ప్రయోజనం ఏమి కనిపించడంలేదు. ఈ కాల్పులకు బయపడైన వలసవాదులు వెళ్ళిపోతారేమో అని.. ప్రభుత్వమే వీటిని ఉపకారణాలుగా వాడుతోందా.. అన్న సందేహము లేకపోలేదు. తాజాగా, మరో వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే ఘటన స్థలంలో అధికారులపై కూడా దుండగుడు కాల్పులకు దిగడంతో వారు అతడిని పై కాల్పులు జరిపిన ఘంటనలో అతడు కూడా మృతి చెందాడు. ఈ ఘటనలో అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డట్టు సమాచారం.
ఇల్లినాయిస్లోని ఇండస్ట్రియల్ పార్కు వద్ద ఓ వ్యక్తి తుపాకితో విరుచుకుపడ్డాడు. పైపులకు సంబంధించిన వాల్వుల తయారీ పరిశ్రమ హెన్రీ ప్రాట్ కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్ (45) ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మార్టిన్ను కాల్చి చంపారు. మార్టిన్ దారుణానికి పాల్పడడం వెనక ఉన్న కారణం తెలియాల్సి ఉంది.