విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్లజరిగిన అగ్నిప్రమాదంలో 17 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం స్థానిక ఆర్అండ్బీ బంగ్లా ఎదురుగా ఉన్న పద్మపూజిత కన్సల్టెన్సీ ఫైనాన్స్ కార్యాలయంలో అకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.
అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఏడు ద్విచక్రవాహనాలు పూర్తిగాను, మరో పది పాక్షికంగాను దగ్ధమయ్యాయి. రూ.5 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
ఒవైసీకి కేసీఆర్ భయపడుతున్నారు: అమిత్ షా