telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యుత్ సమస్యపై కేంద్రంతో చర్చలు: మంత్రి బొత్స

విద్యుత్ కొరత పై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నమాట వాస్తవమేనని అన్నారు. విద్యుత్ సమస్యపై కేంద్రం, పక్క రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

కొత్త పాలసీ అమల్లోకి వచ్చాక ఇసుక కొరత తగ్గిందన్నారు. గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వస్తే.. ఎందుకు అమలుచేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఆస్పత్రుల దగ్గర క్యాంటీన్లు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Related posts