ప్రముఖ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత దివంగత విజయనిర్మల అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. కృష్ణ ఫామ్ హౌస్ వద్ద అంత్యక్రియల ఏర్పాట్లను కృష్ణ అల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ 50 సంవత్సరాల పాటు సహచరిగా ఉండి, కష్ట సుఖాల్లో తోడున్న విజయనిర్మల మరణం అందరికన్నా కృష్ణ గారికి తీరని లోటని, అన్నారు. ఆయనలోని బాధను తొలగించి, తిరిగి మామూలు మనిషిని చేయడం ఎలాగో తమకు తెలియడం లేదని తెలిపారు.
1992లో తన వివాహమైన తరువాత, విజయనిర్మల గారి గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానని జయదేవ్అన్నారు. ఆమె మృతి వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. కృష్ణ, విజయనిర్మలలు కలిసి కష్టాలను, సుఖాలను పంచుకున్నారని తెలిపారు. ఆమె ఓ డేరింగ్ మహిళని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిబ్బరంగా ఉండేవారని జయదేవ్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.