telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కష్టాలో ఇంగ్లాండ్…

చెన్నై వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ కష్టాలో పడిపోతుంది. తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 11 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసిన భారత్ ఈరోజు మరో 29 పరుగులు చేసి 329 వద్ద కుప్పకూలిపోయింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు ఇషాంత్ శర్మ మొదట్లోనే షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడో బంతికే మొదటి వికెట్ తీయడంతో ఒక్క పరుగు కూడా చేయకుండానే ఇంగ్లాండ్ వికెట్ కోల్పోయింది. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ ను అశ్విన్ పెవిలియన్ కు చేర్చగా ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ ను అక్షర్ పటేల్ ఔట్ చేసాడు. అదే అక్షర్ కు ఇదే తొలి టెస్ట్ వికెట్. దాంతో ఇంగ్లాండ్ ప్రస్తుతం 33/3 తో ఉంది. స్టోక్స్(7), డేనియల్ లారెన్స్(5) తో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక భారత్ ప్రస్తుతం ఇంగ్లాండ్ కంటే 295 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ బౌలర్లను చూస్తుంటే ఇంగ్లాండ్ ను ఈరోజే ఆల్ ఔట్ చేసేలా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 65 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

Related posts