మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’. కరోనా తర్వాతా మాస్ మహరాజ్ రవితేజ నటించిన తొలి చిత్రం క్రాక్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు విడుదలకు సిద్దమయింది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో ఈ సినిమా హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల క్రాక్ షోలు నిలిచోయాయి. దాంతో సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశ చెందారు. ఎందుకు ఏంటనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలో రవితేజా పవర్ఫుల్ పోలీస్గా కనిపించి అలరించనున్నాడు. అంతేకాకుండా దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత అందాల రాసి శ్రుతి హాసన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో పాటు ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి నేడు ఈసినిమా షో ఆగిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
previous post
రామ్ చరణ్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు