telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. మార్నింగ్‌ షో క్యాన్సిల్‌

మాస్ మహారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. కరోనా తర్వాతా మాస్ మహరాజ్ రవితేజ నటించిన తొలి చిత్రం క్రాక్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు విడుదలకు సిద్దమయింది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో ఈ సినిమా హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల క్రాక్ షోలు నిలిచోయాయి. దాంతో సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశ చెందారు. ఎందుకు ఏంటనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలో రవితేజా పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించి అలరించనున్నాడు. అంతేకాకుండా దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత అందాల రాసి శ్రుతి హాసన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో పాటు ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి నేడు ఈసినిమా షో ఆగిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts