మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయితేజ్ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, క్రితి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఆయన సంగీత సారథ్యంలో ఇప్పటి వరకు రెండు పాటలు విడుదలైతే రెండింటికీ మంచి ఆదరణ దక్కాయి. ఈ రెండు సాంగ్స్లో ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం..’ సాంగ్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్కు 50 మిలియన్స్ వ్యూస్ రావడం విశేషం. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్గా నటించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ప్రభావంతో వాయిదా పడింది. తాజా సమాచారం మేరకు సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తారని అంటున్నారు.
previous post