telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నైపుణ్యాల నుంచి సామర్థ్యాలవైపు – శ్రామిక శక్తి పరివర్తన కోసం ఆంధ్రప్రదేశ్, సింగపూర్ సంయుక్త ప్రయత్నం

టెక్నాలజీ శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధికి ఇకపై సాంప్రదాయ విద్యావిధానం సరిపోదు.

నాల్గవ పారిశ్రామిక విప్లవం సాంకేతిక నైపుణ్యాలను మాత్రమే కాకుండా సామర్థ్యాలను కూడా కోరుతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

“నైపుణ్యాల నుంచి సామర్ణ్యాలకు శ్రామికశక్తి పరివర్తనను వేగవంతం చేయడం (Skills to Competencies, Accelerating Workforce Transformation)” అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… డైనమిక్ వాతావరణంలో సంక్లిష్ట సమస్యలను స్వీకరించే, ఆవిష్కరించే, పరిష్కరించే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి.

ఎపి ఐటి & ఎలక్ట్రానిక్స్ మంత్రిగా మా రాష్ట్రం ఆవిష్కరణలకు కేంద్రంగా, శ్రామిక శక్తి పరివర్తనలో అగ్రగామిగా ఉంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.

మేము యువతను ఉద్యోగాల కోసం మాత్రమేకాకుండా, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలతో వారిని సిద్ధం చేస్తున్నాం.

అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఎపిలోని యూనివర్సిటీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెడుతున్నాం, సాంప్రదాయ విద్యావిధానానికి స్వస్తిపలుకుతూ కరిక్యులమ్ లో సమూల మార్పులు తెస్తున్నాం.

రీసెర్చి, ఇన్నొవేషన్, స్టూడెంట్ ఎక్సేంజి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లపై సింగపూర్ వర్సిటీలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

ట్రాన్సఫర్మేషన్ ను వేగవంతం చేసే సినర్జీలను తయారుచేయడానికి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం, శ్రామిక శక్తి అభివృద్ధి, ముఖ్యంగా జీవితకాల అభ్యాస రంగంలో ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ అగ్రగామిగా ఉంది.

నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU), సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ (SUSS) వంటి సంస్థలు నిరంతర విద్య, నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలను ప్రారంభించాయి.

NTUలో అసోసియేట్ ప్రొఫెసర్ సియా సీవ్ కీన్, SUSSలో డాక్టర్ యాప్ మీన్ షెంగ్ అభివృద్ధి చేసిన నమూనాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో జీవితకాల అభ్యాసంపై దృష్టి సారించే నైపుణ్య విశ్వవిద్యాలయాలను స్థాపించే ప్రక్రియ ప్రారంభించాం.

ఎపిలో జీవితకాల అభ్యాసం కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి సింగపూర్ లోని నిరంతర విద్యావ్యవస్థ నుండి ఉత్తమ పద్ధతులను, అనుసరించదగిన సహకారాన్ని మేం కోరుకుంటున్నాం.

సింగపూర్ విద్యా వ్యవస్థ బలాల్లో పరిశ్రమ-విద్యారంగం సహకారం ముఖ్యమైంది. సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ (SMU), సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ & డిజైన్ (SUTD) వంటి సంస్థలు పరిశ్రమ అవసరాలను తమ పాఠ్యాంశాల్లో విజయవంతంగా చేర్చాయి.

విద్యార్థులు విద్యాపరంగా నైపుణ్యం కలిగి ఉండటమే కాకుండా పరిశ్రమలకు సిద్ధంగా ఉండేలా తయారుచేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు సంయుక్తంగా పాఠ్యాంశాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన ప్రాజెక్టులను రూపొందించేలా ఇండస్ట్రీ-విద్యారంగం కన్సార్టియాను రూపొందించడానికి మేము కృషి చేస్తున్నాం.

విద్యారంగం, పరిశ్రమల నడుమ అంతరాన్ని తగ్గించే నమూనాలను అభివృద్ధి చేయడానికి SMU, SUTDలతో కలిసి పనిచేయడానికి మేము ఆసక్తిగా ఉన్నాం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ద్వారా భవిష్యత్ పని విధానం రూపుదిద్దుకుంటోంది.

సింగపూర్ AI పరిశోధన, అప్లికేషన్‌లో ముందంజలో ఉంది, SMU ఆధ్వర్యంలోని CARE.AI ల్యాబ్ వంటి సంస్థలు ముందంజలో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు మేము ఎఐ, బ్లాక్‌చెయిన్, IoT లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా AI పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఎఐ-కేంద్రీకృత విద్యా కార్యక్రమాలు, పరిశోధన కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి SMUతో కలిసి పనిచేయడానికి మేము ఆసక్తిగా ఉన్నాం, ఇది మన రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

సింగపూర్‌లోని స్కిల్స్‌ఎస్‌జి వెంచర్స్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.

వియత్నాం, ఇతర ప్రాంతాల్లో వారి పనివిధానం శ్రామిక శక్తి పరివర్తనలో నిబద్ధతకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి రంగాలలో యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి మిషన్‌ను మేము అమలు చేస్తున్నాం.

మా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి స్కిల్స్‌ఎస్‌జి వెంచర్స్‌ సహకారాన్ని కోరుతున్నాం.

అంతర్జాతీయీకరణ అనేది నేటి ఆధునిక విద్యలో కీలకమైన అంశం. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS) వంటి సంస్థలు విద్యార్థుల అభివృద్ధి, అంతర్జాతీయ సహకారంలో ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో, మా విద్యార్థులు అంతర్జాతీయ అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పించే గ్లోబల్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యాల కోసం మేం ఎదురు చూస్తున్నాం.

స్టూడెంట్ ఎక్స్చేంజి కార్యక్రమాలు, ఉమ్మడి పరిశోధన, సహకార ప్రాజెక్టులను సులభతరం చేయడానికి NUS, ఇతర సింగపూర్ సంస్థలతో భాగస్వామ్యం వహించే మార్గాలను మేం అన్వేషిస్తున్నాం.

శ్రామిక శక్తి పరివర్తనలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితమైనవి కావు, అవి ప్రపంచ స్వభావం కలిగి ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే మన పరిష్కారాలు కూడా ఉండాలి.

కలిసి పనిచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ఇరు ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే సినర్జీలను తయారుచేయవచ్చు, దీనివల్ల శ్రామిక శక్తి పరివర్తనకు ప్రపంచ ఉదాహరణగా కూడా ఎపి – సింగపూర్ నిలుస్తాయి.

నైపుణ్యాలను సామర్థ్యాలుగా మార్చే విద్య జీవితాంతం ఉపయోగపడుతుంది. శ్రామిక శక్తిని భవిష్యత్తుకు సిద్ధం చేయడమేగాకుండా ఉమ్మడి దార్శనికతకు మనం కట్టుబడి ఉందాం.

ఈ దిశగా ఫలవంతమైన చర్చలు, సహకారం కోసం తాను ఎదురుచూస్తానని మంత్రి లోకేష్ చెప్పారు.

ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రిజిస్ట్రార్ ఆర్.రాజారామ్, నన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సియా స్యూ, సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రదీప్ రెడ్డి, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ చైర్ ప్రొఫెసర్ చైర్ ప్రొఫెసర్ రాజేష్ ఎలర మోహన్, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్స్ అసిసోసియేట్ ప్రొఫెసర్ యాప్ మీన్ షెంగ్, స్కిల్ ఎస్ఎస్ జి వెంచర్స్ బిజినెస్ డెవలప్ మెంట్ డైరక్టర్స్ చెన్, హాంగ్ సియాంగ్ పాల్గొన్నారు.

Related posts