*నల్గొండ జిల్లాలో కూలిన ట్రైనీ విమానం..
*పైలట్తో పాటు మహిళా ట్రైనీ పైలట్ మృతి..
*విద్యుత్ స్ధంభంపై కూలిన ట్రైనీ విమానం..
*పెద్దవూర మండలం తుండతుర్తిలో ఘటన
*ఘటాన స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు..
*ట్రైనీ ఫైలెట్ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తింపు..
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో రామన్నగూడెం తండా వద్ద ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది..
ఈ ప్రమాదంలో పైలట్తో పాటు మహిళా ట్రైనీ పైలట్ మృతి చెందారు. ఘటనా సమయంలో దట్టమైన మంటలు చూశామని చెబుతున్నారు స్థానికలు రైతులు..
పొలాల్లోహెలికాప్టర్ కూలపోవడం చూసిన స్థానికులు భయపడి పరుగులు తీశారు. కొద్దిసేపటికి తేరుకుని అక్కడకు వెళ్లిన స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది.. వైద్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు..