telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం..కొత్తగా 1,896 మందికి పాజిటివ్

Corona

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,896 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,788 మంది కోలుకోగా, 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 82,647కి చేరింది. ఆసుపత్రుల్లో 22,628 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు కరోనా నుంచి 59,374 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 645కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 338 కేసులు నమోదయ్యాయి.
.

Related posts