నేడు ప్రపంచ కప్ లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ ఇంకా ఆలస్యం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటలకు ఆగిపోయినట్టే ఆగి మళ్ళీ వర్షం ప్రారంభం అయింది. చిరుజల్లులు కురుస్తుండటంతో గ్రౌండ్ ఇంకా పచ్చిగా మారుతోంది. ఎంత ఆరబెట్టినా ఫలితం ఉండటం లేదు.
దీనితో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మరోసారి గ్రౌండ్ను తనిఖీ చేయనున్నారు. అప్పటి వరకు లంచ్ బ్రేక్ను కేటాయించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30కు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత 6 కు గ్రౌండ్ను తనిఖీ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.